Andhra Pradesh : నేడు ఆత్రేయపురంలో కేరళ తరహా పడవ పోటీలు

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి.

Update: 2026-01-11 02:53 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఆత్రేయపురంలో నేటి నుంచి కేరళ తరహా పడవ పోటీలను నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ఈ పడవల పోటీలను నిర్వహించనున్నారు. ఈ పడవల పోటీలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా క్రీడాకారులు పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు.

మూడు రోజుల పాటు...
మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో గాలిపటాలు, రంగవల్లులు, ఈతల పోటీలు కూడా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. మరొకవైపుపడవల పోటీలకు కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన మొత్తం ఇరవై ఐదు జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు చెప్పారు. ఈ పడవల పోటీలను తిలకించేందుకు వేలాది మంది ఆత్రేయపురానికి తరలి వస్తున్నారు.


Tags:    

Similar News