బాబూ జగ్జీవన్ రామ్కు ఘన నివాళులు
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో వైఎస్ జగన్ నివాళులర్పించారు.
స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ బాబూ జగజ్జీవన్రామ్ సేవలను కొనియాడారు. ఆయన దేశానికి అందించిన సేవలను ప్రశంసించారు.
హాజరైన...
ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, సీఎంవో అధికారులు హాజరయ్యారు. బాబూ జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు.