TDP : నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు
నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటయి నలభై నాలుగు సంవత్సరాలు కావడంతో జెండాలు ఎగుర వేసి తమ పార్టీకి చెందిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనన్నారు.
పార్టీ జెండాను ఎగుర వేసి...
ఈరోజు ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు పార్టీ జెండా ఎగురవేయనున్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. గత నాలుగు దశాబ్దాల నుంచి కార్యకర్తలు పార్టీ కోసం పడుతున్న శ్రమతో పాటు పార్టీ విజయానికి కారకులైన వారికి చంద్రబాబు తన ప్రసంగంలో ప్రధానంగా కృతజ్ఞతలు తెలపనున్నారు.