సైకిల్ యాత్రలో ప్రమాదం.. నిమ్మల రామానాయుడికి గాయం

ఈ సైకిల్ యాత్రలో చిన్న అపశృతి జరిగింది. సైకిల్ పై వెళ్తున్న నిమ్మల రామానాయుడు.. ప్రమాదవశాత్తు కిందపడ్డారు.

Update: 2022-03-05 07:55 GMT

దెందులూరు : టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. పాలకొల్లు టిడ్కో ఇళ్ల నుంచి అమరావతి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్రను ప్రారంభించారు. కాగా.. ఈ సైకిల్ యాత్రలో చిన్న అపశృతి జరిగింది. సైకిల్ పై వెళ్తున్న నిమ్మల రామానాయుడు.. ప్రమాదవశాత్తు కిందపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శింగవరం వద్ద ఈ ఘటన జరిగింది. సైకిల్ పై నుంచి కిందపడిన ఆయన ఎడమ కాలికి గాయమవ్వగా.. స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అనంతరం సైకిల్ యాత్రను కొనసాగించారు.



Tags:    

Similar News