Chandrababu : పశ్చిమ బెంగాల్ ఘటనపై చంద్రబాబు ట్వీట్

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు

Update: 2026-03-08 03:06 GMT

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇంటర్నేషనల్ సంతాల్ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రోటోకాల్ కల్పించని రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఆయన విమర్శించారు. తన పర్యటనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ద్రౌపది ముర్ము, సర్వత్రా చర్చ జరుగుతుందన్నారు.

ఘటన దురదృష్టకరమని...
ఈ ఘటన దురదృష్టకరమని, రాష్ట్రపతి పదవిని అవమానించేలా బెంగాల్ ప్రభుత్వం వ్యహరించడం బాధకలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏ ప్రభుత్వం అయినా రాష్ట్రపతి పట్ల అత్యంత గౌరవ, మర్యాదలతో మెలగాల్సి ఉందన్న చంద్రబాబు, రాజ్యాంగ సంస్థలు రాజకీయాలకు అతీతంగా ఉంటాయని, వాటి పవిత్రతను కాపాడుకోవడం సమిష్టి విధి అంటూ సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News