మహావీర్ జయంతి వేడుకల్లో జగన్

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ క్యాంప్‌ కార్యాలయంలో మహావీర్‌ జయంతి కార్యక్రమం జరిగింది

Update: 2023-04-04 06:29 GMT

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ క్యాంప్‌ కార్యాలయంలో మహావీర్‌ జయంతి కార్యక్రమం జరిగింది. మహావీర్‌ జయంతి సందర్భంగా భగవాన్‌ మహావీరుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమని జగన్ అన్నారు.

ముఖ్యమంత్రితో పాటు...
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ జైన్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మనోజ్‌ కొఠారి, రమేష్‌ జైన్, రవి కొఠారి, నిర్మల్‌ జైన్, పలువురు జైనులు పాల్గొన్నారు.


Tags:    

Similar News