మంత్రి జయరాంకు ఐటీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరి జయరాంకు రెండో సారి ఆదాయపు పన్ను శాఖ నోటీసలు జారీ చేశారు

Update: 2023-03-03 02:59 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరి జయరాంకు రెండో సారి ఆదాయపు పన్ను శాఖ నోటీసలు జారీ చేశారు. ఇట్టిన భూముల విషయంలో కొనుగోళ్లు, అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో ఐటీ శాఖ అధికారులు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు ఆయన భార్యకు కూడా నోటీసులు జారీ చేశారు.

ఏప్రిల్ 3న...
ఈ నెల 17వ తేదీ లోపుగా తమ నోటీసులకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 3వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేస్తామని, ఈ విచారణకు మంత్రి జయరాంతో పాటు ఆయన భార్య కూడా హాజరుకావాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.


Tags:    

Similar News