Srisailam :శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతుంది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు దిగువకు నీటిని నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం వద్ద ప్రస్తుతం ఎనిమిది గేట్లు పది అడుగులు మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 2,93,609 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 2,82,502 క్యూసెక్కులుగా ఉంది.
పూర్తి స్థాయి నీటిమట్టం...
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులు ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడంతో నాగార్జున సాగర్ తో పాటు ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద నీరు భారీ గా చేరుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.