vijaya Sai Reddy : టీడీపీ నేతను కలవడంపై విజయసాయిరెడ్డి రియాక్షన్ ఇదే
తనపై వైసీపీ చేస్తున్న ట్రోలింగ్ పై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
తనపై వైసీపీ చేస్తున్న ట్రోలింగ్ పై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. తాను మౌనంగా ఉండటం కొందరు వైసీపీలోని కోటరీకి నచ్చడం లేదని ఆయన అన్నారు. అందుకే తనై వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెడుతున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. తనను కెలకడం తో పాటు ఇరిటేట్ చేయడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నానని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. తన రియాక్షన్ వల్ల జగన్ కు నష్టం కలుగాలని అనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ, జగన్ కు ఎలాంటి ప్రయోజనం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు.
నన్ను బలిపశువుని చేద్దామని...
ఆయన ఎక్స్ లో ఏమాన్నారంటే " నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలి పశువును చేద్దాం అని కోటరి నిర్ణయించుకున్నందున, నన్ను అంతకు ముందు నుంచి 4 ఏళ్ళుగా అవమానిస్తున్నందున, లేని అభాండాల్ని నా నెత్తిస మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను. 2011 లో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025 లో కూడా జగన్ గారే అడిగి ఉంటే (కోటరీ ద్వారా రుద్దే ప్రయత్నం చేయకుండా) సంబంధం లేకున్నా భాద్యత తీసుకుని ఉందేవాదినేమో.కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు. మూడు తరాలుగా ఆ కుటుంబానికి సేవచేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్ పక్కన పెట్టారు. ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు, అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా? అలా చేయకుంటే వెస్నుపోటు దారుడు అవుతాడా? అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా ?" అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లినప్పుడు...
"అవును. నేను ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఇంటికి వెళ్ళా నాకు స్వర్గీయ కృష్ణ కుటుంబానికి రెండు దశాబ్దాల అనుబంధం. అందరూ నా కుమార్తె వివాహానికి వచ్చారు. అదే సమయం లో టీడీ జనార్ధన్, వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పా. కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ ని, చంద్రబాబునే కలుస్తాకానీ వేరేవాళ్ళతో ఎందుకు చర్చిస్తాను. వారు గతం లో రాజకీయ ప్రత్యర్థులు. ఇప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేసు. లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే, ఆ స్కాం రహస్యాలు టీడీపీతో మాట్లాడటానికి నేసు ఆ పార్టీ నాయకుల్ని కలిశా అని జగన్ గారి కోటరీ అంటున్నారు. మరి, స్కామ్ లేనప్పుడు, నేను ఏం చర్చిస్తాను. స్కాం గురించి సిట్ విచారణలో A1 గురించి చెప్పానే కానీ వేరే ఎవ్వరిని నేను ప్రస్తావించలేదు" అంటూ ఆయన ట్వీట్ చేశారు.