VV LakshmiNaryana: అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తా

మాజీ సీబీఐ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకిలో పోటీ చేయాలని నిర్ణయించారు

Update: 2024-03-15 04:21 GMT

VV LakshmiNaryana:మాజీ సీబీఐ డైరెక్టర్ వి.వి లక్ష్మీనారాయణ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకిలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లు, జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి...
నిన్న ఎంవీపీ కాలనీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసం యునైటెడ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేసి ఆయన సొంతంగా జై భారత్ పార్టీని పెట్టుకున్నారు.


Tags:    

Similar News