ఐదు రోజులు కస్టడీకి ఇవ్వండి
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషన్ శాంతిని ఐదు రోజుల పాటు కస్టడీని కోరారు
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషన్ శాంతిని ఐదు రోజుల పాటు కస్టడీని కోరారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన శాంతి ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఏసీబీ అధికారుల దాడుల్లో...
ఏసీబీ అధికారుల దాడుల్లో అనేక ఆస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించిన ఆస్తులుండటంతో ఆమెను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు తర్వాత న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా రిమాండ్ కు ఆదేశించారు. శాంతిని విచారించేందుకు ఐదు రోజుల కస్టడీకి అనుమతివ్వాలని ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలయింది