బీజేపీతో క‌లిస్తే జగన్‌కే అడ్వాంటేజ్‌ : సీపీఐ రామకృష్ణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి వెళ్లే పార్టీలకు ఓటమి తప్పదని

Update: 2023-08-27 10:40 GMT

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి వెళ్లే పార్టీలకు ఓటమి తప్పదని టీడీపీ, జ‌న‌సేన‌ల‌ను హెచ్చరించారు. టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తారని.. తప్పకుండా అధికారంలోకి వస్తామని.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా ఆలోచిస్తారని తాను అనుకుంటున్నానని రామ‌కృష్ణ‌ అన్నారు. టీడీపీ, జ‌న‌సేన‌లు వామపక్షాల‌తో కాకుండా బీజేపీతో కలిస్తే జగన్ నెత్తిమీద పాలుపోసినట్లేనని.. అది జగన్‌కు అడ్వాంటేజ్‌గా మారుతుందని హెచ్చరించారు. చంద్రబాబు తప్పుడు నిర్ణయం తీసుకుంటారని తాము అనుకోవడం లేదని అన్నారు.

వైసీపీ ప్ర‌భుత్వంలో ఏపీలో అభివృద్ధి లేదని అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆరోపించారు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పోతున్నాయని మండిపడ్డారు. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం గుండు సున్నానే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని రామకృష్ణ మండిపడ్డారు.


Tags:    

Similar News