వల్లభనేని పిటీషన్ పై నేడు విచారణ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్‌పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది.

Update: 2025-02-20 02:46 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్‌పై నేడు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. జైలులో వసతులపై వల్లభనేని వంశీ పిటిషన్‌ వేసిన నేపథ్యంలో ఈ విచారణ జరగనుంది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు బెడ్ తో పాటు ఇంటి నుంచి భోజనవసతి వచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ లో వల్లభనేని వంశీ కోరారు.

సబ్ జైలులో...
అయితే సబ్‌ జైలులో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయని? ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లేఖతీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. వంశీ పిటిషన్‌పై నేడు ఎస్సీ, ఎస్టీకోర్టులో విచారణ జరగనుంది. దీంతో పాటు వల్లభనేని వంశీని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసుల వేసిన పిటీషన్ పై కూడా నేడు విచారణ జరగనుంది.


Tags:    

Similar News