Chandrababu : ఢిల్లీలో చంద్రబాబు బిజీ బిజీ
కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు
కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో పాటిల్ను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు నీటి భద్రత అత్యంత కీలక అంశమని... రాష్ట్రంలో సాగునీటి-తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రాజెక్టులపై కేంద్ర–రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఉందన్నారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు.