చెడును ఎదరించడానికి ప్రజలు కూడా ముందుకు రావాలి : చంద్రబాబు
గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పరిశ్రమల్ని తరిమేశారని, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న నమ్మకాన్ని పోగొట్టారన్నారు. వినుకొండలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలు, భవిష్యత్ ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారన్నారు.కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ పునర్నిర్మాణం మొదలు పెట్టామని, 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని, టీచర్లు, పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండేలా వేగంగా పనులు చేశామన్న చంద్రబాబు . కొత్త రోడ్లను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు.వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజార్చేలా కొందరు ప్రవర్తిస్తున్నారని, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు తిట్టే పార్టీ రాష్ట్రంలో ఉందన్న చంద్రబాబు ఆంబోతుల తరహాలో తయారై రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.