తన అరెస్టు పై చంద్రబాబు సంచలన వాఖ్యలు

ఐటీ నోటీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ, రేపో, మాపో తనను అరెస్టు చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడులు కూడా చేస్తారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు. వైఎస్సార్ తనపై 26 ఎంక్వైరీలు వేసి విఫలమయ్యారని గుర్తుచేశారు

Update: 2023-09-06 10:59 GMT

తన అరెస్టు పై చంద్రబాబు సంచలన వాఖ్యలు

ఐటీ నోటీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ, రేపో, మాపో తనను అరెస్టు చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడులు కూడా చేస్తారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు. వైఎస్సార్ తనపై 26 ఎంక్వైరీలు వేసి విఫలమయ్యారని గుర్తుచేశారు. ఇప్పుడు ఏదో కంపెనీ పేరుతో తనపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రజాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, మాజీ మంత్రి వివేకానందరెడ్డిని సొంత బంధువులే హత్య చేసి తనపై నారాసుర రక్త చరిత్ర అని ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో భారీగా ఆస్తుల దోపిడీ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. రైతులకు కూడా చెప్పకుండా వారి భూముల్లో కాల్వలు తవ్వుతున్నారన్నారు. తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసులు వేసిన నాగేంద్రను వేధిస్తున్నారన్నారు. రేపో, ఎల్లుండో తననూ అరెస్టు చేయవచ్చని లేదా దాడి చేస్తారన్నారు. తాను నిప్పులా బతికానని, ఎప్పుడూ ఏ తప్పూ చేయలేదని చంద్రబాబు తెలిపారు. వైసీపీ చేసిన తప్పులన్నింటినీ మనపై మోపి కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. 45 ఏళ్లగా తనపై ఎవ్వరూ కేసులు పెట్టలేదని, ఎక్కడా సాక్ష్యాధారాలు లేవన్నారు. తనపై దాడి చేసినా చేస్తారని, తాను ఎవరికీ భయపడనని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News