జగన్ పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత లంకా దినకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2021-12-07 08:08 GMT

ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ నేత లంకా దినకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్ టైమ్ సీఎంగా జగన్ మిగిలిపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి కలెక్షన్ల కోసం వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీం పేరుతో పేదలను దోచుకుంటున్నారని లంకా దినకరన్ విమర్శించారు. విపక్షంలో ఉన్నప్పుడు పేదల ఇళ్లపై ఉనన రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

బలవంతపు వసూళ్లకు....
ఓటీఎస్ పేరిట పేదల నుంచి బలవంతపు వసూళ్లకు దిగవద్దని లంకా దినకర్ హితవు పలికారు. సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని హెచ్చరికలు కూడా చేస్తున్నారన్నారు. హక్కు పత్రాలపై లబ్దిదారుల ఫొటో ఉండాలి తప్పించి, జగన్ ఫొటో ఎందుకని లంకా దినకరన్ నిలదీశారు. జగన్ పాలనకు ప్రజలు వన్ టైమ్ సెటిల్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని లంకా దినకర్ సెటైర్ వేశారు.


Tags:    

Similar News