నేడు జగన్ కృష్ణా జిల్లాలో పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2022-08-25 02:52 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పెడనలో జరిగే వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత నిధులను జగన్ విడుదల చేయనున్నారు. పెడన - బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. లబ్దిదారుల ఖాతాల్లో జగన్ నిధులు జమ చేయనున్నారు. ఏడాదికి ప్రతి నేతన్నకు 24 వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికి మూడేళ్లుగా ఈ పథకం కింద నేత కార్మికులకు నిధులను అందచేయనున్నారు.

నేతన్నల కోసం...
ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఐదు విడతల్లో ప్రతి నేతన్న కుటుంబానికి 1,20,000 లను ప్రభుత్వం అందిస్తుంది. వారి ఆసరా కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగ్ 10.40 గంటలకు పెడన చేరుకుంటారు. అక్కడ లబ్దిదారులతో నేరుగా మాట్లాడతారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.


Tags:    

Similar News