శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు

శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు

Update: 2026-03-02 07:21 GMT

శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. సోంపేట అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి గడ్డి బాల ముకుందరావు నివాసంలో సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళంలోని చాపురం, డీసీసీబీ కాలనీలోని 3వ చైనా బజార్ వద్ద నివాసాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందిన సమాచారం మేరకు సోదాలు జరుపుతున్నారు.

కీలక పత్రాలను...
ఇంట్లోని కీలక పత్రాలు, ఆస్తుల దస్త్రాలను క్షుణ్ణంగా అధికారులు పరిశీలిస్తున్నాకె, బాల ముకుందరావు హాస్టల్ వార్డెన్ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుతో జనవరి 28న కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News