Chandrababu : జగన్ ను అరెస్ట్ చేయడం నాకు నిమిషం పట్టదు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2026-04-09 12:24 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌడీయిజం బ్యాచ్ , సైకో ప్రవర్తనలతో, వితండవాదాలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. సూరేపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏమీ అనకుండానే ఓ పత్రికపై దాడి చేస్తున్నారన్నారు. ఆడబిడ్డల్ని వేధించారని, ఇలాంటి ప్రవర్తనపై సమాధానం చెప్పే పరిస్థితి సైకో పార్టీకి లేదని చంద్రబాబు అన్నారు. ఇలాంటి తరహా వ్యక్తి రాజకీయ పార్టీ వెనుక లేకపోతే ఇంటి నుంచి బయటకు రాగలడా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తుంటే మనం అంతా కలిసి కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఇప్పటికే రాష్ట్రం విభజన వల్ల, గత పాలకుల వల్ల చాలా నష్టపోయిందని, ఇప్పుడిప్పుడే రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నామని, అడవుల్లో ఉండే ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్ళిపోతారని, ఇతను కూడా అంతే ఎక్కడో ఉండి దుష్ప్రచారం చేసి పారిపోతాడని చంద్రబాబు అన్నారు.

సద్విమర్శలుచేస్తే సమాధానం...
సద్విమర్శలు చేస్తే సమాధానం ఇస్తామని, అమరావతికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు అని అబద్ధాలు చెప్తున్నారని, అమరావతి సెల్ఫ్ మోనిటైజేషన్ ప్రాజెక్టు అని అన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అంటున్నారని, సీఆర్డీఏ రీజియన్ అదే అని తెలియకుండా పోయింది అతనికి అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అమరావతి పేరు కూడా పలకడానికి ఇష్టం లేక విధ్వంసం సృష్టించి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి తరహా వ్యక్తులను అరెస్టు చేయడానికి తనకు నిముషం పట్టదని, కానీ చట్టం తన పనితాను చేసుకుంటుందని అన్నారు. తాను నంద్యాలలో పర్యటిస్తుంటే ఏ తప్పు లేకుండా నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టారని, • విధ్వంసం సృష్టించే వ్యక్తులు ఉంటే ప్రజలకు, ఆడబిడ్డలకూ రాష్ట్రంలో రక్షణ ఉంటుందా.? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి పార్టీలను వ్యక్తులను, మర్చిపోవటమే ప్రజలకు శ్రేయస్కరమని చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News