Ys Sharmila : అమరావతి పేరుతో లూటీ : వైఎస్ షర్మిల
రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూసమీకరణపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు
రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూసమీకరణపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. రాజధాని పేరుతో సేకరించిన తొలివిడత 54 వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడ అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రెండో విడత 20 వేల ఎకరాలు అదానీ,అంబానీ కోసమేనా? అని ఆమె నిలదీశార. రెండో విడత భూ సేకరణకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్న వైఎస్ షర్మిల 54 వేల ఎకరాలపై వెంటనే శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముంబయి ఛత్రపతి విమానాశ్రయం 1850 ఎకరాలు..అమరావతిలో విమానాశ్రయానికి ఐదువేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు.బీజింగ్,లండన్ లో ఒలంపిక్స్ నిర్వహించే స్పోర్ట్ హబ్ లు 150 ఎకరాలు మాత్రమేనన్న ఆమె అమరావతి స్పోర్ట్స్ హబ్ కి 2500 ఎకరాలు ఎందుకన్నారు. రియల్ రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతుందని వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు.