రైతు సానుకూల ప్రదేశ్ గా మారుస్తున్నాం : చంద్రబాబు
ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను రైతు సానుకూలప్రదేశ్గా మారుస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను రైతు సానుకూలప్రదేశ్గా మారుస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. నీటి భద్రత అందరికీ కావాలి..కానీ నీటి సంరక్షణను చాలా మంది పట్టించుకోవటం లేదన్నారు. • గతంలో రాయలసీమలోని ఊట కాలువల్లోనూ నీళ్లు సమృద్ధిగా ఉండేవని చంద్రబాబు అన్నారు. రాయలసీమ రాళ్ల సీమగా మారకుండా రతనాల సీమగా మార్చాలని ఎన్టీఆర్ ప్రాజెక్టులు చేపట్టారని, హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు టీడీపీ చూపిన చొరవ కారణంగానే వచ్చాయని చంద్రబాబు చెప్పారు. తెలుగు గంగ రాయలసీమను సస్యశ్యామలం చేస్తూ చెన్నై దాహార్తిని తీరుస్తోందన్న చంద్రబాబు ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య నీటి కోసం విభేదాలు వచ్చిన పరిస్థితి. కావేరీ జలవివాదం అలాంటిదేనని అన్నారు.