Chandrababu : నేడు మంత్రులతో చంద్రబాబు భేటీ

ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం మంత్రులతో సమావేశం కానున్నారు

Update: 2025-12-10 02:20 GMT

ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం మంత్రులు, కార్యదర్శులు హెచ్ ఓడీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకూ మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్షా సమావేశం జరగనుంది. వృద్ధిరేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చించనున్నారు. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్సు అంశాలపై ముఖ్యమంత్రి అధ్యక్షతన చర్చ జరుగుతుంది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్ధిక ఫలితాలపై సమావేశంలో చంద్రబాబు చర్చిస్తారు. మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

వివిధ అంశాలపై చర్చ...
సూపర్ సిక్స్ పథకాల అమలు, ప్రభుత్వం అందించే పౌరసేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపై కూడా చర్చ జరుగుతుంది. ఫైళ్ల క్లియరెన్సు, ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక, అవేర్, డేటా లేక్, ఐటీ అప్లికేషన్ల పై సమావేశంలో ప్రజెంటేషన్ ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలు, ఫిర్యాదులు వాటి పరిష్కారం పై హెచ్ ఓ డీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేయనున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు వాటి ఫలితాలపై సమావేశంలో చర్చిస్తారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న రుణాలు, వాటి రీస్ట్రక్చరింగ్ అంశంపై శాఖల వారీగా సమీక్ష చేయడంతో పాటు మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాధించాల్సిన లక్ష్యాలపై అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News