నల్లమల సాగర్ ప్రాజెక్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
విధ్వంసమైన వ్యవస్థల నుంచి సుపరిపాలనను గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 ఏడాది మంచి ఫలితాలను ఇచ్చిందని, ప్రజల ఆశల్ని నిలబెట్టామని, వారిలో విశ్వాసాన్ని మళ్లీ కల్పించామని తెలిపారు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని పరిస్థితి నుంచి సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా చేయగలిగామని అన్నారు. ఈ ఏడాది కూడా మరింత కష్టించి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తల్లికి వందనం ద్వారా రూ.10,090 కోట్లను 67 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాలకు వేశామని, స్త్రీశక్తి ద్వారా 3.5 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారని, ఇందుకోసం ఇప్పటి వరకూ రూ.1114 కోట్లు వ్యయం చేశామని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు జమ చేశామన్న చంద్రబాబు దీపం 2.0 ద్వారా 2 కోట్ల సిలిండర్లను ఇప్పటికి పంపిణీ చేయగలిగామన్నారు. దీనికి రూ.2684 కోట్లు వ్యయం చేశామని చెప్పారు.