Andhra Pradesh : స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు

Update: 2026-02-11 04:18 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలకు ఫేసిషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరును తీసుకోనున్నారు. సభకు వచ్చి తన స్థానంలో వచ్చి కూర్చున్న ఎమ్మెల్యే హాజరు మాత్రమే నమోదవుతుంది. ఏఐ ఆధారంగా ఈ ఫేసిషియల్ రికగ్నేషన్ ద్వారా హాజరును తీసుకోవాలని నిర్ణయించారు.

ఫేసిషియల్ రికగ్నిషన్ ద్వారా...
వైసీపీ ఎమ్మెల్యేలు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి సభలోకి రాకుండా బయట నుంచి వెళ్లిపోతున్నారని, దీనిని అరికట్టేందుకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలను ఇప్పటికే స్పీకర్ కార్యాలయం గుర్తించింది. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాలకు కొత్తగా ఫేసిషియల్ రికగ్నేషన్ ఆధారిత అటెండెన్స్ తీసుకోనున్నారు.


Tags:    

Similar News