Andhra Pradesh : రాజధాని అమరావతి రైతులకు తీపికబురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని కోసం అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. గతంలో అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సీఆర్డీయే కు ఇచ్చిన వారికి రిటర్నబుల్ ప్లాట్ లలో అసైన్డ్ అని పేర్కొన్న ప్రభుత్వం దానిని మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో రైతులకు భారీ ఊరట దక్కింది.
అసైన్డ్ అనే పదం తొలగించడంతో...
అసైన్డ్ అని ఉండటంతో తమ ప్లాట్ లు అమ్ముడు పోవడం లేదని అమరావతి ప్రభుత్వానికి తెలపడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ రైతులు ఇచ్చిన భూములకు కూడా రిటర్నబుల్ ప్లాట్ల లో అసైన్డ్ అనే పదం తీసివేసి పట్టా భూమి అని పేర్కొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించడంతోఈ మేరకు ఈ రోజు ల్యాండ్ పూలింగ్ చట్టంలో 9.24 లోని కాలం నంబర్ 7, రూల్ నంబర్ 11 (4) క్లాజ్ ను మారుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో నంబర్ 187 ను పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ విడుదల చేశారు.