Amaravathi : నేటి నుంచి రెండో విడతభూ సమీకరణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు రెండో విడత భూ సమీకరణ ప్రారంభం కానుంది

Update: 2026-01-07 02:45 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నేడు రెండో విడత భూ సమీకరణ ప్రారంభం కానుంది. తొలుత వడ్లమాను, యండ్రాయి గ్రామాల్లో మొదటి రోజు సమీకరణ చేయనున్నారు. ఈ రెండు గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం రెండో విడతలో అమరావతి ప్రాంతంలో దాదాపు ఇరవై వేల ఎకరానలను రైతుల నుంచి సమీకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

రెండు గ్రామాల్లో...
దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయింది. అయితే ఈ రోజు మంచి రోజు కావడంతో నేటి నుంచి భూసమీకరణను మొదలుపెట్టాలని నిర్ణయించారు. గ్రామసభల్లో మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో పాటు సీఆర్డీఏ అధికారులు హాజరయి రైతులకు ఏ రకమైన ప్రయోజనాలు అందుతాయో వివరించనున్నారు.


Tags:    

Similar News