విశాఖకు ఎల్పీజీ గ్యాస్ నౌకలు
విశాఖకు ఎల్పీజీ గ్యాస్తో నౌకలు చేరుకున్నాయి
విశాఖకు ఎల్పీజీ గ్యాస్తో నౌకలు చేరుకున్నాయి. దీంతో దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత చాలా వరకూ తీరనుందని చెబుతున్నారు. రెండు నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. నేడు అందులో ఉన్న ఎల్పీజీ గ్యాస్ ను దిగుమతి చేస్తారు. గ్యాస్, ఆయిల్ ఇబ్బందుల వేళ ఉపశమనం కలగనుంది.
కొరత తీరుతుందని...
ఎల్పీజీ, చమురు నౌకలు విశాఖ తీరానికి చేరుకోవడంతో వాటిని చూసేందుకు జనం తరలి వస్తున్నారు. హార్బర్ మౌత్లో భారీ ఎల్పీజీ నౌక బిర్చ్ లంగరేశారు.ఇప్పటికే విశాఖ పోర్టుకు ఎంటీ పెట్రాయిట్ చేరుకుంది. భారీ ఎల్పీజీ గ్యాస్ నిల్వలలతో రావడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నట్లయింది.