వేధింపులు తట్టుకోలేక.... సెల్ఫీ తీసుకుంటూ?

Update: 2017-10-25 02:04 GMT

ఇంటి యజమాని వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఉప్పరపల్లి ఎస్ఏఆర్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటి నిర్వహణ డబ్బు కోసం అపార్ట్‌మెంట్ కార్యదర్శి సలీం తనను వేధిస్తున్నాడంటూ తబస్సుం అనే మహిళ ఇటీవల రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేసింది.

అధికార పార్టీ నేత వేధింపులే....

సలీం అధికార పార్టీ నాయకుడు కావడంతో అతడిపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు భయపడుతున్నారంటూ ఆమె ఆరోపిస్తూ ఏసీపీకి ఫోన్ చేసి తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు సమాచారమిచ్చింది. వంద నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు ఇంటికి వచ్చేలోపే ఆమె స్పృహ కోల్పోవడంతో వెంటనే పాతబస్తీలోని ఆసుపత్రికి తరలించారు. తబస్సుం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తబస్సుం ఫొటోలను సలీం సోషల్‌మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Similar News