విజయసాయిరెడ్డి మనుషులు మాట్లాడే భాష మాట్లాడటం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మూర్ఖులు మాట్లాడే భాషను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారన్నారు. ఆందోళనలో విజయసాయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రధాని ముందు మోకరిల్లి విజయసాయిరెడ్డి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.