రేవంత్ ను మాట అనని టీడీపీ నేతలు

Update: 2017-10-28 12:38 GMT

తెలంగాణ టీడీపీ నేతల సమావేశం చంద్రబాబుతో ముగిసింది. తెలంగాణలో పార్టీ బలోపేతం అయ్యేవిధంగా ఏమేం చర్యలు తీసుకోవాలో చంద్రబాబు టిటిడిపీ నేతలకు సూచించారు. వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యమన్నారు. రేవంత్ రెడ్డి పై ఎలాంటి విమర్శలకు తాము దిగదల్చుకోలేదని టీటీడీపీ నేతలు అనంతరం మీడియాతో అన్నారు. రేవంత్ రెడ్డి పార్టీని వీడటం బాధాకరమేనని అన్న టీటీడీపీ నేతలు ఆయన పార్టీని వీడటం బాధాకరమన్నారు. ప్రతిపక్షంగానే వ్యవహిరిస్తూ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటామన్నారు. రేవంత్ రెడ్డి ఆరోపించినట్లుగా తాము కేసీఆర్ తో కుమ్మక్కు కాలేదన్నారు. అయితే ఆయన విమర్శలు వ్యక్తిగతమన్న టీటీడీపీ నేతలు ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టిపెడతామన్నారు. ప్రస్తుతానికి టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ కొనసాగుతారన్నారు. రేవంత్ సమర్పించిన రాజీనామా లేఖలో ఎవరిని విమర్శించలేదన్నారు. రేవంత్ పై ఎవరూ విమర్శలు చేయవద్దన్న చంద్రబాబు సూచనలను తమ్ముళ్లు పాటించారు.

Similar News