రాహుల్ అంగీకరించినట్లేనా?

Update: 2017-03-14 08:53 GMT

యువరాజు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ యువరాజుగా పిలుచుకునే రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి ఎదురైన చేదు అనుభవంపై పెదవి విప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో క్షీణిస్తుందని ఒప్పుకున్నారు. ప్రజల్లో పార్టీకి పట్టు తప్పిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత పరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాహుల్ అన్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వడం సహజమేనన్నారు రాహుల్.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తాము మూడు రాష్ట్రాల్లో గెలిచినట్లేనని, అయితే మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని ఉపయోగించుకుని లాగేసుకుందని రాహుల్ ఆరోపించారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించిందన్నారు. ఎమ్మెల్యేలను దొంగిలించి మరీ బీజేపీ మణిపూర్, గోవాల్లో అధికారం చేపట్టడం పట్ల రాహుల్ విచారం వ్యక్తం చేశారు. బీజేపీ సిద్ధాంతాలపై తాము అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పారాయన.

Similar News