మోడీతో గవర్నర్ భేటీ ఇందుకేనా?

Update: 2018-01-09 11:59 GMT

ప్రధాని మోడీతో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. దాదాపు అరగంటసేపు ప్రధానితో గవర్నర్ చర్చించారు. రెండు రాష్ట్రాల్లో నెలొకొన్న విభజన సమస్యలపైనే ప్రధానంగా వీరు చర్చించినట్లుతెలిసింది. ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కావడానికి కొన్ని రోజుల ముందే గవర్నర్ మోడీకి ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను ప్రధాని మోడీకి వివరించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు గవర్నర్ హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కూడా కలిసి రెండు రాష్ట్రాల్లో ఉన్న విభజన సమస్యలపై చర్చలు జరిపారు.

Similar News