మంత్రిపై రోజా సంచలన వ్యాఖ్యలు

Update: 2017-08-08 01:51 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మహిళలతో రాఖీలు కట్టించుకునే అర్హత లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. క్యాబినెట్‌లో ఉన్న ఉత్తరాంధ్రకు చెందిన కంత్రీ మంత్రి కాలకేయుడిలా ఉన్నతాధికారుల్ని వేధిస్తున్న పట్టించుకోని ముఖ‌్యమంత్రి మహిళల రక్షణ గురించి ఎలా మాట్లాడతారని నిలదీశారు. మహిళా అధికారిణిని వేధించిన మంత్రిపై తక్షణం చర్యలు తీసుకోకపోతే తామే తగిన బుద్ధి చెబుతామని రోజా హెచ్చరించారు. మరోవైపు మంత్రి వ్యవహారం టీడీపీ నేతల్ని ఇరకాటంలో పడేసింది. దానిని ఖండించేందుకు కూడా నేతలెవరు ముందుకు రాకపోవడం గమనార్హం.

Similar News