పోలవరంలో సమ్మె సైరన్...!

Update: 2018-01-11 06:35 GMT

పోలవరం పనులు మళ్లీ నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టుకు, ట్రాన్స్ ట్రాయ్ కు అచ్చొచ్చినట్లు కన్పించడం లేదు. మూడు నెలల నుంచి ట్రాన్స్ ట్రాయ్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది, ఉద్యోగులు విధులు బహిష్కరించారు. 200 మందికి పైగా డ్రైవర్లు, ఆపరేటర్లు, సూపర్ వైజర్లు ఈ విధులను బహిష్కరిస్తున్నారు. పండగ వస్తున్నా ఇంతవరకూ జీతాలు చెల్లించకపోవడంతో వారు సమ్మెకు దిగారు. దీంతో పోలవరం కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి.

Similar News