తెలంగాణా బిజెపి అద్యక్షుడు ఆయనే...!

Update: 2016-04-09 22:49 GMT

భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ నియమితులయ్యారు. అయిదు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను ప్రకటించిన పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కె. లక్ష్మణ్ పేరును ఖరారు చేసింది. లక్ష్మణ్ ప్రస్తుతం శాసనసభలో భాజపా పక్ష నేతగా కొనసాగుతున్నారు. గత కొంత కాలంగా పార్టీ అధ్యక్షుడెవరనే అంశంపై పార్టీ సీనియర్లు, హితులతో చర్చించిన అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.1980లో భాజపాలో చేరిన లక్ష్మణ్ అంచలంచెలుగా ఎదిగారు. 1995 నుంచి 1999 వరకు పార్టీ హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడిగా సేవలందించారు. ఆ సమయంలోనే ఆయన ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. 1999లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. రెండేళ్ళ క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.

Similar News