జగన్ పై మరోసారి ఎంపీ జేసీ ఫైర్

Update: 2017-07-31 12:58 GMT

అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై మరోసారి ధ్వజమెత్తారు. జగన్ కు సీఎం అయ్యే అదృష్టం లేదని జేసీ జోస్యం చెప్పారు. చంద్రబాబుకు ఇరిగేషన్ ప్రాజెక్టులే శ్రీరామరక్షగా నిలుస్తాయన్నారు జేసీ. నిధులు లేకపోయినా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు భాయీ..భాయీ..నని చమత్కరించారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్ ఎంతో కృషి చేశాడని జేసి పొగడ్తలతో ముంచెత్తారు. ఉద్దానం విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ ను అభినందించాల్సిందేనన్నారు. చంద్రబాబు కూడా ఉద్దానం సమస్యపై వెంటనే స్పందించడం హర్షణీయమన్న జేసీ వెంకయ్య నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఇంతకు ముందులాగా ఇప్పుడు వెంకయ్యనాయుడి దగ్గరకు వెళ్లలేమన్న జేసీ...రాజ్యాంగ పదవిలో ఉన్నా రాష్ట్రం గురించి ఆయన ఆలోచిస్తారని అభిప్రాయపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు టీడీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Similar News