జగన్ కు ఓటమి తప్పదా.....?

Update: 2017-07-07 11:08 GMT

యూపీ లో అపూర్వ సోదరుల ఓటమికి కారణమైన ప్రశాంత్ కిషోర్ తో ఏపీ లో ఒరిగేదేమీ లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్ సారధ్యంలో యూపీ లో అఖిలేష్-రాహుల్ సోదరులు బోల్తా పడ్డట్లే ఏపీ లో రాహుల్-జగన్ సోదరులు బోల్తా కొడతారని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీతో జగన్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించిన ఉమ., శాంత కిషోర్., ప్రశాంత్ కిశోర్ లు ఎంత మంది వచ్చినా తమకు ఇబ్బంది లేదన్నారు. ప్రజలు జగన్ ని నమ్మే పరిస్థితి లేదన్నారు. జగన్ ఎన్నికలలో సలహదారులుగా పెట్టుకున్నా తమకు ఇబ్బంది లేదని రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తే మాత్రం అణిచివేస్తామని హెచ్చరించారు.

Similar News