కూతురిని కిడ్నాప్ చేసిన తండ్రి

Update: 2017-06-01 01:58 GMT

ప్రేమ పెళ్లి ఆ తండ్రికి ఇష్టం లేదు. అయినా తండ్రి మాట వినకుండా కూతురు తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసేసుకుంది. ఇది జీర్ణించుకోలేని కన్న తండ్రి కూతురినే కిడ్నాప్ చేసిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. మల్కాజిగిరి గౌతంనగర్‌కు చెందిన ఎస్‌. వేదశ్రీ బీటెక్‌ రెండో సంవత్సరం చదువు తోంది. గతనెల 22వ తేదీన ఇంటినుంచి వెళ్లిపోయి తాను ప్రేమించిన అదే ప్రాంతానికి చెందిన పవన్‌కుమార్‌ను వివాహం చేసుకుంది. ఇద్దరూ మేజర్లే కావడంతో వీరి పెళ్లికి అబ్బాయి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేదు. అప్పటి నుంచి భర్త ఇంట్లోనే ఉంటోంది. పవన్‌ కుమార్‌ తల్లికి మంగళవారం జబ్బు చేయగా ఆస్పత్రిలో చేర్పించారు. అతడి తండ్రి సాయిరాం భార్యను చూడటానికి ఆస్పత్రికి వెళుతూ కొడుకు, కోడలిని మల్లికార్జుననగర్‌లో ఉంటున్న బావమరిది సంతోష్‌ వద్ద ఉంచి ఆస్పత్రికి వెళ్లాడు. ఉదయం 10 గంటల సమయంలో వేదశ్రీ తండ్రి రఘువరన్‌ 30 మందితో వచ్చి ఆమెను కిడ్నాప్‌ చేశాడు. సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News