అమెరికాలో మరో తెలుగు యువకుడు బలి

Update: 2017-02-24 04:50 GMT

అమెరికాలో కాల్పుల మోత విన్పిస్తూనే ఉన్నాయి. అమాయక తెలుగు యువకులు తూటాలకు బలయిపోతున్నారు. ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన వంశీ దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటన మరవకముందే....తాజాగా అమెరికాలో మరో తెలుగు యువకుడు అమెరికన్ జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.

కాన్సన్ లో ఓ బార్ కు వెళ్లిన కూచిభొట్ల శ్రీనివాస్, అలోక్ లతో అమెరికన్ ఇయాన్ గ్రిల్లోట్ గొడవ పడ్డారు. తమ దేశం విడిచి వెళ్లాలని బెదిరించారు. తన కంటే మీరు ఎందులో గొప్ప అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఉన్నట్లుండి ఇయాన్ తుపాకీ తీసి కాల్పుల జరిపాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల అక్కడికక్కడే మరణించాడు. తీవ్ర గాయాలతో ఉన్నఅలోక్ ను ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల వ్యవధిలో అమెరికాలో ఇద్దరు తెలుగు యువకులు మరణించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలోని తెలుగు సంఘాలు ఆందోళనకు సిద్దమవుతున్నాయి.

Similar News