ఎన్నికల ముందు చంద్రబాబు డ్రామాలు

ఎన్నికలకు గంటల సమయం ఉన్నప్పుడు చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారని, చంద్రబాబు నాటకాలను ఆపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన [more]

Update: 2019-04-10 08:47 GMT

ఎన్నికలకు గంటల సమయం ఉన్నప్పుడు చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారని, చంద్రబాబు నాటకాలను ఆపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ… తాము చాలామంది అధికారులపై ఫిర్యాదులు చేసినా అందరిపై చర్యలు తీసుకోలేదని, ప్రాథమికంగా ఆధారాలు ఉన్న అధికారులపైనే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందన్నారు. పోలింగ్ దగ్గరపడే కొద్ది చంద్రబాబు మరిన్ని కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం లేకుండా చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. చంద్రబాబు చర్యలకు ఈసీ అడ్డుకట్ట వేయాలన్నారు. 2009లో చంద్రబాబు ఫిర్యాదు మేరకు అప్పటి డీజీపీని బదిలీ చేస్తే సీఎంగా ఉన్న వైఎస్సార్ ధర్నా చేయలేదని గుర్తు చేశారు.

Tags:    

Similar News