సీసీ టీవీ ఫుటేజీలో దొరుకుతాయా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తును వేగం చేశారు. పులివెందుల పట్టణంలో ఉన్న వివిధ షాపుల వద్ద ఉన్న సీసీ టీవీ [more]

Update: 2021-08-25 02:26 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తును వేగం చేశారు. పులివెందుల పట్టణంలో ఉన్న వివిధ షాపుల వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. అయితే హత్య జరిగి రెండేళ్లు కావస్తుండటంతో అప్పటి ఫుటేజీ లభ్యమవుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. పులివెందుల పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న షాపుల వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీని సీబీఐ అధికారులు పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీలో కీలక ఆధారాలేమైనా లభిస్తాయామోనన్న ఆశతో వాటిని పరిశీలించినట్లు తెలిసింది. దీంతో పాటు గతంలో అనేక మార్లు వివేకానందరెడ్డి హత్య కేసులో విచారించిన పులివెందులకు చెందిన జగదీశ్వర్ రెడ్డిని మరోసారి నిన్న విచారించారు.

Tags:    

Similar News