సీబీఐ అధికారులతో వైఎస్ వివేకా కుమార్తె గంటసేపు సమావేశం

సీబీఐ అధికారులతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మరోసారి భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలను సునీత వారికి వివరించారు. [more]

Update: 2021-08-18 05:52 GMT

సీబీఐ అధికారులతో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మరోసారి భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలను సునీత వారికి వివరించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 75వ రోజుకు చేరుకుంది. ఈరోజు పులివెందులకు చెందిన భరత్ కుమార్ యాదవ్, మహ్మద్ భాషా, ఎర్రగంగిరెడ్డి, నాగేంద్రలను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. కడప సెంట్రల్ జైలులో ఈ విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత మరికొందరు అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశముంది.

Tags:    

Similar News