బాబూ మనస్సాక్షిని ప్రశ్నించుకో

గత ఐదేళ్లు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభలో మాట్లాడే అవకాశం తమ పార్టీ సభ్యులకు ఇచ్చారా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు గుండెమీద [more]

Update: 2019-07-17 04:57 GMT

గత ఐదేళ్లు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సభలో మాట్లాడే అవకాశం తమ పార్టీ సభ్యులకు ఇచ్చారా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు గుండెమీద చేతులు వేసుకుని చెప్పాలన్నారు. ఈ సమావేశాల్లో స్పీకర్ అందరికీ అవకాశం కల్పిస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. నలభై ఏళ్ల ఇండ్రస్ట్రీ అని పదే పదే చంద్రబాబు చెబుతున్నారని, అనుభవం పనికిరాదని, నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా శాసనసభ నిబంధనలు మారవని చెప్పారు. ఈసందర్భంగా చంద్రబాబునాయుడుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను డిక్టేట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఇన్ని రోజుల అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులకు ఇచ్చిన సమయాన్ని గత ఐదేళ్లలో ఎప్పుడైనా వైసీపీ సభ్యులకు ఇచ్చారా? అని జగన్ ప్రశ్నించారు.

Tags:    

Similar News