ముగిసిన భేటీ… నిమ్మగడ్డ వ్యవహారమే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. జగన్ దంపతులిద్దరూ రాజ్ భవన్ కు వచ్చారు. గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు [more]

Update: 2020-11-13 08:07 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. జగన్ దంపతులిద్దరూ రాజ్ భవన్ కు వచ్చారు. గవర్నర్ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత ఇరువురి మధ్య రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును జగన్ గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున స్థానిక సంస్థల నిర్వహణ సాధ్యం కాదని జగన్ గవర్నర్ కు తెలిపినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, వివిధ యూనివర్సీల వైస్ ఛాన్సిలర్ల నియామకంపై కూడా జగన్ గవర్నర్ తో చర్చించినట్లు తెలిసింది.

Tags:    

Similar News