కరోనా కంట్రోల్ లోకి వస్తుంది

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లో కంట్రోల్ లోనే ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ కరోనాపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ [more]

Update: 2020-05-09 09:01 GMT

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్ లో కంట్రోల్ లోనే ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ కరోనాపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో దేశంలోనే అత్యధిక టెస్టులను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే లక్షా అరవై వేలు టెస్ట్ లను నిర్వహించామని తెలిపారు. ప్రతి మిలియన్ కు మూడువేలకు పైగా టెస్ట్ లు చేస్తుండటం వల్ల కరోనా నియంత్రణలోకి వస్తుందన్నారు. వైద్యులు, మున్సిపల్ సిబ్బంది చేస్తున్న కృషిని జగన్ ప్రశంసించారు. చెన్నై కోయంబేడు మార్కెట్ కు వెల్లి వచ్చిన వారిని ట్రేస్ చేసి ట్రీట్ చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News