క్యాడర్ కు జగన్ పిలుపు…ఇదే

కరోనా విపత్తు నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రతి ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన పిలుపు నిచ్చారు. [more]

Update: 2020-03-31 02:41 GMT

కరోనా విపత్తు నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రతి ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన పిలుపు నిచ్చారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ యంత్రాంగం మొత్తం సహాయ కార్యక్రామాల్లో పాల్గొనాలని జగన్ కోరారు. పోలీసులకు, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని జగన్ ఆకాంక్షించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూనే పార్టీ పరంగా ప్రజలకు సేవలను అందించాలని జగన్ కోరారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు గుంపులుగా చేరకుండా చూడాలన్నారు. నిత్యావసరవస్తువులు అందరికీ సక్రమంగా అందుతున్నాయా? లేదా? అన్నది పరిశీలించాలని జగన్ తెలిపారు. అలాగే నిత్యావసరవ వస్తువల ధరలు మార్కెట్లో ఎక్కడైనా అధిక ధరలకు విక్రయిస్తుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు. అలాగే వలస కూలీలు, అనాధలకు భోజనాలు అందేలా చూడాలని జగన్ కోరారు. కరోనా విపత్తు నుంచి రాష్ట్రం బయటపడే వరకూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జగన్ పిలుపు నిచ్చారు.

Tags:    

Similar News