జగన్ మరికొన్ని కఠిన నిర్ణయాలతో?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై జగన్ కలెక్టర్లతో చర్చించనున్నారు. ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలు [more]

Update: 2020-03-20 04:37 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై జగన్ కలెక్టర్లతో చర్చించనున్నారు. ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలు మూసివేశారు. షాపింగ్ మాల్స్, సినిమాహాళ్లను కూడా మూసివేశారు. మరికొన్ని చర్యలు తీసుకునే అవకాశముంది. బార్లను, పర్యాటక కేంద్రాలను కూడా మూసివేసే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉంది. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత జగన్ మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి డేటా సేకరణనున పకడ్బందీగా సేకరించాలని జగన్ కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించారు.

Tags:    

Similar News