జగన్ కేసు 20కి వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. జగన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నందున [more]

Update: 2020-03-14 03:09 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. జగన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నందున కోర్టుకు హాజరుకాలేనన్న పిటీషన్ ను సీబీఐ న్యాయస్థానం అంగీకరించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిచ్చింది. దీంతో సీబీఐ న్యాయస్థానం ఈ కేసును మార్చి 20వ తేదీకి వాయిదా వేసింది. ఇదే సమయంలో ప్రయివేటు వ్యక్తలు పెట్టబడులకు సంబంధించి ఛార్జిషీట్ లో తన పేరును తొలగించాలని కూడా జగన్ పిటీషన్ వేశారు. రాజకీయకక్షతోనే తనపై కాంగ్రెస్ నేతలు అక్రమంగా కేసులు నమోదు చేశారని పిటీషన్ లో వివరించారు.

Tags:    

Similar News