జగన్ అర్థరాత్రి నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనా వికేంద్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమయిపోయారు. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జగన్ ఈ [more]

Update: 2020-02-01 01:38 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనా వికేంద్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమయిపోయారు. కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన జగన్ ఈ మేరకు కొన్ని కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. న్యాయ విభాగానికి చెందిన విజిలెన్స్ కమిషన్, కమిషన్ ఆఫ్ ఎంక్కైరీస్ కార్యాలయాలను వెలగపూడి సచివాయం నుంచి కర్నూలుకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తరలింపు ప్రక్రియ ప్రారంభమయింది. కర్నూలులో వీటికి సంబంధించి అవసరమైన భవనాలను సిద్ధం చేయాలని కర్నూలు కలెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News